byసూర్య | Thu, Aug 11, 2022, 10:50 AM
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులతో శివాజీ చౌక్ నుండి ప్రారంభించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐ నరహరి, ఎస్సైరాజారెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.