byసూర్య | Mon, Aug 08, 2022, 05:01 PM
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు కు ఏరియా ఆస్పత్రి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యేకు వైద్యులు సూచించారు.