byసూర్య | Fri, Aug 05, 2022, 01:47 PM
బస్సులో హ్యాండ్ బ్యాగ్ చోరీ అయినట్లు మహారాష్ట్రలోని బీవండి గ్రామానికి చెందిన లక్ష్మి కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో ఉన్న తన కుమార్తె వద్దకు బస్సులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు హ్యాండ్ బ్యాగ్ చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో ఎనిమిదిన్నర తులాల బంగారం, రూ. 13 వేల నగదు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్ హెచ్ ఓ పి. నరేష్ తెలిపారు.