byసూర్య | Fri, Aug 05, 2022, 01:46 PM
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో కామారెడ్డి -నిజాంసాగర్ రహదారిలో శుక్రవారం ఉదయం నుండి ఎల్లారెడ్డి పోలీసులు వాహన తనిఖీలు మొదలు పెట్టారు. వాహనాల తనిఖీల్లో వాహనాలపై పడిన చాలన్లు, పెండింగ్ చాలన్ల పై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. వాహనాలు నిలుపుతూ, వారి వాహనాల పై పెండింగ్ చాలన్లు ఉన్నాయలేద అని పరిశీలిస్తూ, చాలన్లు ఉన్నవారికి చాలన్లు కట్టాలని, లేదంటే వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు రోడ్డు భద్రత పాటించాలని స్థానిక పోలీసులు సూచనలు అందించడం జరిగింది.