byసూర్య | Fri, Aug 05, 2022, 12:37 PM
హుజురాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హుజురాబాద్ అభివృద్ది పై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.
దీంతో అంబేద్కర్ చౌరస్తాకు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకరి పై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.