byసూర్య | Fri, Aug 05, 2022, 12:11 PM
తెలంగాణలో తాజాగా 1061 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 43,318 కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. హైదరాబాద్ 401, రంగారెడ్డి 63, నల్గొండ 51, మేడ్చల్ మల్కాజిగిరి 56, కరీంనగర్ 43, రాజన్న సిరిసిల్ల 46, నిజామాబాద్ 30, హనుమకొండ 30, మహబూబాబాద్ 29, సిద్దిపేట 26, మంచిర్యాల 25 కేసులు నమోదయ్యాయి.