byసూర్య | Fri, Aug 05, 2022, 12:41 PM
ఎస్సారెస్పీ లోని ఐదు గేట్ల ఒపెన్ చేసి గోదావరిలోకి 20, 456 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 45 వేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులో 1088 అడుగులు, 77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్కేప్, కెఏంసీకి 8 వేలు, వరదకాలువకు 5 వేలు, లక్ష్మీ కాలువకు 50, సరస్వతికి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస్పీ అధికారులు ఐదు గేట్లను విడిచిన అధికారులు మరో నాలుగు గేట్లను అధికారులు ఎత్తి 38, 810 క్యూసెక్యుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మొత్తం తొమ్మిది గేట్లను ఇప్పటి వరకు అధికారులు ఎత్తివేశారు.