రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం

byసూర్య | Wed, Jul 06, 2022, 02:31 PM

మరోసారి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య వార్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీసుకునే రుణాల్లో భారీగా కోతను విధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 52,167 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఇందులో రూ. 19 వేల కోట్ల మేర కేంద్రం కోత విధించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 33 వేల కోట్లకు మించి అప్పు చేయలేని పరిస్థితి నెలకొంది.  


రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్ర ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతో పాటు, వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, గత రెండేళ్లలో ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి రాష్ట్రాలు చేసిన అప్పులను... ఆమేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కోత విధించింది. 


ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో... ఇకపై కార్పొరేషన్లకు అప్పులు లభించకపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణకు రావాల్సిన అప్పులను కేంద్రం కొంత కాలం నిలిపివేసింది. దీంతో, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తాజాగా రూ. 33 వేల కోట్ల వరకు రుణాలు పొందేందుకు అనుమతి లభించడంతో కొంత మేరకు ఉపశమనం లభించినట్టయింది.


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM