బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్

byసూర్య | Wed, Jul 06, 2022, 02:32 PM

మధ్యాహ్న  భోజన పథకంలో విద్యార్థులకు పురుగుల భోజనం వడ్డించడమే  బంగారు తెలంగాణానా అని ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించిన ఘటనలపై ఆయన స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పౌష్టికాహారం దేవుడెరుగు, విద్యార్థులకు పట్టెడన్నం పెట్టడం లేదన్నారు.   ‘పురుగులతో నిండిన కూడా పిల్లలకు పెట్టేది? నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా? చిన్న పిల్లలని కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర! మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర !!’ అని సంజయ్ ట్వీట్ చేశారు. 


ఇదిలావుంటే ఇక మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. పురుగుల అన్నం తినలేక చాలామంది విద్యార్థులు కడుపు మాడ్చుకుంటున్నట్టు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు సిద్ధిపేట, గద్వాల జిల్లాల్లోని గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మరోవైపు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకుల విద్యా సంస్థల్లో అందిస్తున్న భోజనం తిని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఐదురోజులుగా పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM