byసూర్య | Mon, Jul 04, 2022, 08:30 AM
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్టం రాజోలు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
వీరిని వెంటనే పోలీసులు స్థానిక కామిని ఆసుపత్రికి తమ పోలీస్ వాహనంలో తరలించారు. వర్షం కురుస్తున్నడంతో రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.