విషాదం.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన బాలిక మృతి

byసూర్య | Mon, Jul 04, 2022, 08:32 AM

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న బాలిక మృతిచెందింది. ప్ర‌ముఖ వెబ్ సైట్‌, ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇంటి వద్దనే ఉంటోంది. కాగా.


అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు కొంతకాలంగా ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కాసేపటికి అపస్మారకస్థితిలో పడి ఉన్న బాలికను కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలిక శనివారం మృతిచెందింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ వివరించారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM