byసూర్య | Mon, Jul 04, 2022, 08:32 AM
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న బాలిక మృతిచెందింది. ప్రముఖ వెబ్ సైట్, ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇంటి వద్దనే ఉంటోంది. కాగా.
అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కాసేపటికి అపస్మారకస్థితిలో పడి ఉన్న బాలికను కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలిక శనివారం మృతిచెందింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ వివరించారు.