మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి: రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Jul 04, 2022, 12:17 AM

మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ లో విజయ సంకల్ప సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రాశస్త్యాన్ని, తాము చేసిన, చేయబోయే అభివృద్ధిని గురించి మాత్రమే మాట్లాడారు. ఇతర బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేసినా, తాను మాత్రం రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. 


దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మిత్రులారా... తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా కుటుంబపాలన, అవినీతి ఊసెత్తకుండా మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...! అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అంటూ విమర్శించారు. కేసీఆర్ కు మోదీనే అధిష్ఠానం అని వ్యాఖ్యానించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM