byసూర్య | Tue, May 24, 2022, 10:28 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ 23వ డివిజన్ కు చెందిన కాకతీయ హిల్స్, ప్రశాంతి గోల్డెన్ హిల్స్, ప్రశాంతి అవెన్యూ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీల్లో పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్లు, మంచి నీటి లైన్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా పనులకు అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, 23వ వైస్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ జివి ప్రతాప్ రెడ్డి, రవితేజ, స్పందన, శ్యామ్ సుందర్ రెడ్డి, సందీప్, ప్రవీణ్, ముకుంద రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.