byసూర్య | Tue, May 24, 2022, 10:37 AM
మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా సమీపంలో మంగళవారం(ఈరోజు) ఉదయం 10. 30గం టలకు ప్రభుత్వ నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని ఎంపీపీ కొరుపోలు రఘుమారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరవుతారని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, సహకార సంఘం భవనంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సర్పంచ్లు. ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరవ్వాలని ఆయన కోరారు