byసూర్య | Wed, May 18, 2022, 10:02 AM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామంలో 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శిల్పాలను బయటపడ్డాయి. పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నరేందర్రావు, ప్రవీణ్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం గ్రామాన్ని సందర్శించి నల్ల శానపురాతి శిల్పాలను పరిశీలించారు. ఈ శిల్పాలు కాకతీయుల కాలానికి చెందిన క్రీ. శ. 13వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించామన్నారు. గ్రామస్తుల సహకారంతో శిల్పాలను ఆయన నిలబెట్టించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ శిల్పాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందన్నారు.