byసూర్య | Wed, May 18, 2022, 10:03 AM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిరాం (24) అనే యువకుడు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన సాయిరాం లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అప్పటికే సాయిరాం మృతిచెందాడు. సాయిరాం మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.