byసూర్య | Sat, May 04, 2024, 11:45 AM
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం 19వ వార్డు పోచమ్మ బస్తీలో మున్సిపల్ యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే సకల జనుల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు.