byసూర్య | Sat, May 04, 2024, 12:17 PM
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం మండల ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని మాట్లాడుతూ. శనివారం సాయంత్రం 4 గంటల నుండి ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.