byసూర్య | Sat, May 04, 2024, 12:08 PM
యాదాద్రి జిల్లా భువనగిరి, ఆత్మకూర్ మండలంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య మూడు గంటల పాటు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. శివపార్వతుల వివాహ వేడుకలు చూస్తున్నంత సేపు భక్తులు తన్మయత్వంతో పులకరించారు. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమఃశివాయ’ అంటూ శివనామస్మరణతో ఆలయం మారు మోగింది.