byసూర్య | Tue, May 17, 2022, 04:13 PM
వనపర్తి జిల్లా: గోపాల్పేట మండలం చెన్నూరులో దారుణం చోటు చేసుకొంది. కోడల్ని వేధించిన మామ పై కోడలు కర్రతో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఇదిలా ఉంటే ఆస్తి కోసమే మామను కోడలు కొట్టి చంపిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో రాములు అనే వ్యక్తి తన కోడల్ని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న సమయంలో మొబైల్ లో రికార్డు చేసినట్టుగా కోడలు చెబుతుంది. మంగళవారం కూడా వేధింపులకు గురి చేయడంతో రాములును కోడలు తీవ్రంగా కర్రలతో కొట్టింది. గాయపడిన రాములును ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించాడు. ఈ వార్త పై మరింత సమచారం తెలియాల్సి ఉంది.