ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో 'రైతు బంధు' జమ : మంత్రి నిరంజన్‌రెడ్డి

byసూర్య | Sun, Jun 06, 2021, 12:33 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిన బ్యాంకుల ఖాతాల్లోనూ నిధులు జమవుతాయని చెప్పారు. ఇటీవల పలు బ్యాంకులు విలీనమవగా.. ఆయా బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు మారాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతుల ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మంత్రి స్పష్టతనిచ్చారు. ఈ నెల 10వ తేదీలోపు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఏమైనా సందేహాలు లేదా ఇతర వివరాల కోసం రైతులు రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి.. నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను రైతులు వ్యవసాయాధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధరిణిలో నమోదైన రైతులందరికీ సాయం ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM