byసూర్య | Sun, Jun 06, 2021, 11:47 AM
హైదరాబాద్ సిటీ ఈసీ నది ఒడ్డున రెండు మొసళ్లు చనిపోవడం కలకలం రేపింది. గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామానికి చెందిన యువకులు చేపలు పట్టేందుకు నదిలో వల వేశారు. మరుసటి రోజు వల తీయగా, చేపలతో పాటు రెండు మొసలి పిల్లలు వలలో చిక్కుకుని మృతి చెంది కనిపించాయి. అయితే, చేపలు పట్టేవారు వాటిని చూసినా ఎవరికీ చెప్పలేదు. వలతో పాటు మొసళ్ల కళేబరాలను అక్కడే వదిలేశారు. శనివారం మధ్యాహ్నం పిల్లలు ఆడుకునేందుకు వెళ్లి, మొసళ్ల కళేబరాలను చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. చిన్న వలకే రెండు మొసలి పిల్లలు బయటపడ్డాయంటే, ఇంకా నదిలో ఎన్ని మొసళ్లు ఉన్నాయో..? అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.