byసూర్య | Wed, May 08, 2024, 04:14 PM
ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ ఉపాధి హామీ కూలీలకు బుధవారం ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు. భావి భారత నిర్మాణంలో ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర అన్నారు. అనంతరం కూలీలతో ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. సిబ్బంది శివాజీరావు, కూలీలు ఉన్నారు.