byసూర్య | Wed, May 08, 2024, 04:09 PM
లోకసభ ఎన్నికలలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్ కు రెండు రోజుల ముందు అనగా ఈ నెల 12, 13 తేదీలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రసారానికి జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తు అనుమతి పొందవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.