byసూర్య | Fri, Apr 09, 2021, 02:06 PM
ఉరేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి తిప్పర్తి మండలంలో చోటు చేసికుంది... తిప్పర్తి మండలం గడి కొండారం గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్న కుమారుడు మహేష్ (20) మద్యం దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేష్ చీరతో ఉరేసుకున్నాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించే సరికి మృతిచెందాడు. సమచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మహేష్ ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని తెలిసింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.