సూర్యాపేటలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం

byసూర్య | Fri, Apr 09, 2021, 02:22 PM

 ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల భారీ కాన్వాయ్‌తో సూర్యాపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా పిట్టరాం రెడ్డి సేన 5 వేల మందితో షర్మిలకు ఘన స్వాగతం పలికింది. అడగడుగునా అభిమానులతో అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో సంకల్ప సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వైఎస్‌ సతీమణి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి కూడా కుమార్తె వెంటే ఉన్నారు. ప్రస్తుతం షర్మిల సూర్యాపేట దాటి.. నకిరేకల్ చేరుకున్నారు.


ఖమ్మం పట్టణానికి సమీపంలోని పెద్దతండా వద్ద వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వీరంతా పెవిలియన్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సంకల్ప సభకు భారీగానే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని షర్మిల పార్టీ నేత ఒకరు తెలిపారు. సభలో షర్మిల ఏం మాట్లాడుతారా..? అని అభిమానులు, అనుచరులు, పార్టీ నేతల్లో సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM