byసూర్య | Fri, Apr 09, 2021, 01:44 PM
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గం. సమయంలో టవేరా వాహనం బైక్ ను ఢీకొనగా బొంరాస్ పేట గ్రామానికి చెందిన గడ్డల బాలు(32)అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో కోట్ల యాదయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కోట్ల యాదయ్య తన తమ్ముడు తో కలిసి కొడంగల్ మండలం లక్ష్మి పల్లి లోని యాదయ్య అత్తగారింటికి శంకర్ పల్లి నుంచి వస్తూ ఈ ప్రమాదంలో గాయపడ్డారు.