byసూర్య | Wed, Jan 20, 2021, 05:41 PM
నాగర్కర్నూల్- వనపర్తి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 50 గొర్రెలు దుర్మరణం చెందాయి. అలాగే పన్నెండు మంది ప్రయాణికులతో పాటు డిసిఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన డీసీఎం డ్రైవర్ ను 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.