byసూర్య | Thu, Jan 21, 2021, 09:18 AM
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన సింగరేణి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 372 ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు లోకల్, నాన్లోకల్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జూనియర్స్టాఫ్ నర్స్ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మొత్తం పోస్టులు: 372
ఇందులో ఫిట్టర్- 128 (లోకల్ 105, జనరల్ 23), ఎలక్ట్రిషియన్- 51 (లోకల్ 43, జనరల్ 8), వెల్డర్-54 (లోకల్ 44, జనరల్10), టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22 (లోకల్ 18, జనరల్ 4), మోటార్ మెకానిక్ ట్రైనీ-14 (లోకల్ 12, జనరల్ 2), ఫౌండర్ మెన్/మౌల్డర్ ట్రైనీ-19 (లోకల్ 16, జనరల్ 3), జూనియర్ స్టాఫ్ నర్స్-84 (లోకల్ 67, జనరల్ 17)
జూనియర్ స్టాఫ్నర్స్ మినహా మిగిలిన పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అర్హత: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు చేసేటప్పుడు సర్టిఫికెట్ల సాఫ్ట్కాపీలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 22
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 4