బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Wed, Jan 20, 2021, 05:25 PM

సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లో తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయడానికి మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆ పూజా సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లారని అన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ దంపతులు ఏం కలిపారో చెప్పాలని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో టీఎంసీతో వచ్చే లాభమేమిటో సీఎం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ సీఎం కావాలని తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కోరుకుంటున్నారని, కేటీఆర్ సీఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ సీఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని, కేటీఆర్ సీఎం కావడాన్ని ఇష్టపడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని అన్నారు. దళితుడిని సీఎం ని చేస్తానని కేసీఆర్ చెప్పారని, ఇప్పటికైనా ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబం కోసమేనని, తాము చేసే పూజలు సమాజ హితం కోసమని బండి సంజయ్ అన్నారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని, ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని అన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM