తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు

byసూర్య | Tue, Jan 19, 2021, 09:35 AM

హైదరాబాద్‌ :  తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు మొత్తం 2,92,128 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,86,542 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 4,005 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.


2,283 మంది హోంక్వారంటైన్‌లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉన్నారు. 1581 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో నిన్న 31,486 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 75,15,066 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు కేవలం 0.54 శాతంగా ఉందని పేర్కొన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM