కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళకు అస్వస్థత

byసూర్య | Tue, Jan 19, 2021, 09:40 AM

కరోనా మహమ్మరిని దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగామొత్తం 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. అయితే కొన్నిచోట్ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు అస్వస్థతకు గురవుతున్నారు.


మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్నవారిలో ఏడుగురు ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేశారు. తాజాగా హైదరబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రియాక్షన్ ఇవ్వడంతో ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఉప్పల్‌కు చెందిన నవీన అనే మహిళ జనవరి 16న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. మరుసటి రోజే వాంతులు, మైకం కమ్మడం, నీరసం.. వంటి లక్షణాలు రావడంతో సోమవారం గాంధీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం నవీన పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.


Latest News
 

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM
నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM