వర్షం నీరు నిల్వ వున్న చోట అప్రమత్తంగా ఉండాలి

byసూర్య | Sat, Oct 10, 2020, 02:38 PM

భాగ్యనగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా విద్యుత్ విభాగం అప్రమత్తమైంది. వర్షం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూపెరింటెండింగ్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్‌లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి సమీక్షించారు. గ్రేటర్‌లో భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయాలని రఘుమా రెడ్డి చెప్పారు. వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే 1912 లేదా 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM