byసూర్య | Sat, Oct 10, 2020, 02:12 PM
బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు పూర్తయిన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఎయిమ్స్ అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్లో లోటుపాట్లను తెలుసుకునేందుకు సందర్శించినట్లు పేర్కొన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా తొమ్మిది ఎయిమ్స్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణానికి స్థలం కేటాయింపై కేంద్రమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని ఎయిమ్స్కు బదలాయించాలని కోరారు. ఎయిమ్స్ నిర్మాణం, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందని, భవిష్యత్ మరింత తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. వైద్య కళాశాల పూర్తయితే 750 మంది విద్యనభ్యసిస్తారని తెలిపారు. నెల రోజుల్లో ఓపీ బ్లాక్ను పునః ప్రారంభిస్తామని, ఆయుష్ కేంద్రా సైతం ఏర్పాటు చేస్తామని వివరించారు. వైద్య కళాశాల ప్రాంగణంలో బ్యాంక్, పోస్టాఫీస్ సైతం అందుబాటులో ఉంచుతామన్నారు.