byసూర్య | Sat, Jan 25, 2020, 08:34 AM
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 2,647 వార్డులు, 324 డివిజన్లకు గాను మొత్తం 12,926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 134 కౌంటింగ్ కేంద్రాల్లో 2,169 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ దగ్గర ముగ్గురు చొప్పున ఉంటారు. మొత్తం 10 వేల మంది సిబ్బందిని నియమించారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.