byసూర్య | Wed, Mar 20, 2019, 07:10 PM
సీఈవో రజత్ కుమార్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీలకు పలు సూచనలు చేశారు.ఎన్నికల నిబంధనావళిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాం. 25వ తేదీన ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల కోసం 58 నామినేషన్లు దాఖలయినట్లు రజత్ కుమార్ తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 328 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 3 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.