byసూర్య | Wed, Mar 20, 2019, 06:47 PM
తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి… కేంద్రంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించబోతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో.. టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. వచ్చే వర్షాకాలంలో మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలు యాసంగి పంటకు అందిస్తామని ప్రజలకు హామీ లిచ్చారు. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఈటెల అన్నారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈటల కోరారు.