మార్చి 31 నాటికి ఇంటింటికి సురక్షిత నీరు: పల్లా

byసూర్య | Sun, Jan 20, 2019, 12:33 PM

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నమని తెలిపారు. సీఎం కేసీఆర్ కరెంట్ ఉత్పత్తి, వాడకంపై ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తారన్నారు. విద్యుత్ వెలుగుల సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం చేపట్టినం. 2019 మార్చి 31 నాటికి ఇంటింటికి సురక్షిత నీరు ఇచ్చి తీరుతమన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా 20 వేలకు పైగా చెరువులను బాగు చేసుకున్నం. వ్యవసాయ రంగంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. ఇవాళ అనేక రాష్ర్టాల్లో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నరని ఆయన పేర్కొన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM