byసూర్య | Sun, Jan 20, 2019, 11:25 AM
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చను చేపట్టారు. కాంగ్రెస్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మల్లు భట్టివిక్రమార్కను ప్రతిపక్షనేతగా ప్రకటించారు. ప్రతిపక్షనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ అభినందించారు. 119 స్థానాలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో 10 శాతం సీట్లు సాధించే పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందింది.