సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు.. రేవంత్ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Wed, Oct 30, 2024, 07:37 PM

తెలంగాణలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ల అమలుపై హైకోర్టు స్పందించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం (అక్టోబర్ 30న) రోజున.. హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి.. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి జస్టిస్‌ ఎస్‌.నంద ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ పిటిషనర్‌ పక్షాన వాదనలను వినిపించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలను ధర్మాసనం సమర్థించింది.


ఈ క్రమంలోనే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు గానూ.. "ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌"ను నియమించాలని రేవంత్ రెడ్డి సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌ల శాతంను నిర్ణయించడానికి వీలుగా.. డాక్టర్‌ కె.కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, వికాస్‌ కిషన్‌రావు గవాలి కేసులో త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను పాటించి.. తెలంగాణలో కూడా ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాలని రేవంత్ రెడ్డి సర్కారును హైకోర్టు ఆదేశించింది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ల శాతంను నిర్ణయించేందుకు రాష్ట్ర బీసీ కమిషన్‌కు రేవంత్ రెడ్డి సర్కారు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించింది. దీనిపై బీసీలకు రాజకీయ రిజర్వేషన్‌ల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా హైకోర్టులో సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్‌.కృష్ణయ్య వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఏకసభ్య ధర్మాసనం పరిశీలించి వాదనలు విని.. రిజర్వేషన్లపై అధ్యయాన్ని బీసీ కమిషన్‌కు అప్పజెప్పడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.


బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దమని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే చర్యలు చేపట్టాలని సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి సర్కారును "డెడికేటెడ్‌ కమిషన్‌"ను నియమించాలని ఆదేశించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన "స్పెషల్ డెడికేటెడ్‌ కమిషన్‌"ను నియమించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కృష్ణయ్యా కోరారు.


Latest News
 

నారాయణపేటలో భూ భారతి దరఖాస్తుల వేగవంత పరిష్కారం Wed, Jun 18, 2025, 01:08 PM
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ Wed, Jun 18, 2025, 01:04 PM
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. గడ్డం వివేక్‌తో సహా కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ Wed, Jun 18, 2025, 01:03 PM
పచ్చదనం కోసం పిలుపు.. మునుగోడులో మొక్కల పండుగ Wed, Jun 18, 2025, 12:58 PM
స్థానిక ఎన్నికల గెలుపుకు కాంగ్రెస్ సర్వశక్తులు.. భారీ సభలతో రైతు భరోసా బూస్ట్ Wed, Jun 18, 2025, 12:54 PM