తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం

byసూర్య | Wed, Oct 30, 2024, 10:50 PM

రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న మయోనైజ్‌ను తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం (అక్టోబర్ 30న) ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌‌ కమిటీల పని తీరును సమావేశంలో మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ ఎగ్స్‌తో, ఉడకబెట్టని ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని మంత్రికి అధికారులు వివరించారు.


కేరళలో మయోనైజ్‌పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోనూ బ్యాన్ విధించాలని మంత్రిని కోరారు. సమావేశంలో అధికారులతో చర్చించిన అనంతరం.. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.


అయితే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నందినగర్‌లో జరిగిన వీక్లీ మార్కెట్‌లో మోమోస్ తిని.. ఓ మహిళ మృతి చెందటంతో పాటు సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురై.. ఆస్పత్రులపాలైన ఘటన.. సర్వత్రా ఆందోళనకు గురి చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో పుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని తేల్చిన వైద్యులు.. అందుకు మయోనైజ్‌ కారణమని స్పష్టం చేశారు. ఇదే కాకుండా.. ఈ ఘటన కంటే ముందు సికింద్రాబాద్ పరిధిలోనూ.. ఓ హోటల్‌లో శవర్మతో మయోనైజ్ తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూడటంతో.. మయోనైజ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


ఇటీవల నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుడంటంతో.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మధ్య కాలంలో.. నగరవ్యాప్తంగా ఉన్న వందల హోటళ్లు, రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ మీద దాడులు నిర్వహించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు చేయగా.. మరికొన్నింటికి నోటీసులు జారీ చేసి భారీగా ఫైన్ విధించాయి. అయితే.. అధికారులు నిర్వహించిన చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో పాడైన మయోనైజ్‌ ఉండటాన్ని అధికారులు గమనించారు. ఈ విషయాలన్నిటిని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకురాగా.. తక్షణమే తెలంగాణలో మయొనైజ్ బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


ఆహారప్రియులు ఇష్టంగా తినే మయోనైజ్‌ను మండి బిర్యానీలు, కబాబ్, పిజ్జాలు, బర్గర్లు, శవర్మా, మోమోస్ వంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా తింటుంటారు. అయితే.. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో ఈ మయోనైజ్‌ను తయారు చేస్తారు. అయితే.. ఇది ఉడికించని పదార్థం కావడం వల్ల హానికర బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుంది.


Latest News
 

భూభారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం Wed, Apr 23, 2025, 06:07 PM
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం Wed, Apr 23, 2025, 06:04 PM
పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: డాక్టర్ తిరుపతి Wed, Apr 23, 2025, 06:02 PM
హుజురాబాద్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం Wed, Apr 23, 2025, 06:00 PM
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి Wed, Apr 23, 2025, 05:45 PM