విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా టీచర్లు ప్రొత్సహించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 06:14 PM

విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే చెకుముఖి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లకు జిల్లాలోని8,9,10 తరగతుల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సాహించాలని జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎ.మాణయ్య కోరారు. సోమవారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో చెకుముఖి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ 2024 వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  జన విజ్ఞాన వేదిక  విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుటలో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా చేకు ముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. జె. వి. వి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదరులు బాలయ్య , సాయితేజలు మాట్లాడుతూ  టెస్ట్‌లను  పాఠశాల, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో దశల వారీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జోగిపేట పట్టణ పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎస్‌ నరోత్తమ్‌ కుమార్‌  మాట్లాడుతూ మండలంలో గతంలో రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు ఎంపికై మండలానికి పేరు వచ్చేలా చేసిన మండల ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. పరీక్ష నిర్వాహకులు వి మహేష్‌ కుమార చారి, వి వీరేశంలు మాట్లాడుతూ మండల విద్యాధికారి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలు విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు త్రినాథ్‌ రావు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు శ్రీ మంజ్యా నాయక్,అనిల్‌ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు చంటి చంద్రశేఖర్, వి మహేష్‌ కుమార చారి,జిల్లా ఉపాధ్యక్షులు ఎ చంద్రశేఖర్, రమేష్,మండల ఉపాధ్యక్షులు వి వీరేశం,ఉపాధ్యాయులు అమత,సరిత,కిషన్, లక్ష్మన్‌ ఎంఆర్‌సీ  విష్ణు వర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Latest News
 

ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Fri, May 23, 2025, 07:32 PM
తర్వాత జరగబోయేది ఇదే: ఎంపీ రఘునందన్ రావు Fri, May 23, 2025, 07:26 PM
నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు పట్టాలు Fri, May 23, 2025, 07:22 PM
సంధ్య థియేటర్ ఘటన.. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్షీ ఆగ్రహం Fri, May 23, 2025, 07:16 PM
రాత్రి దంచుడే దంచుడు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Fri, May 23, 2025, 07:11 PM