హైదరాబాద్‌లో గోల్ఫ్‌ సిటీ.. 200 ఎకరాల్లో ఏర్పాటు

byసూర్య | Sun, Oct 20, 2024, 10:18 PM

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వాలు కూడా నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, మెట్రో వంటి నిర్మించగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా కొత్త అభివృద్ధి పనులు చేపడుతోంది.


ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌తో పాటుగా కొత్తగా ఫోర్త్‌సిటీ (ఫ్యూచర్ సిటీ) ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటిచారు. అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు, స్కిల్ యూనివర్సిటీ, అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణ కల్పిస్తామన్నారు. మెట్రో ఫేజ్‌-2లో భాగంగా ఫోర్త్ సిటీకి మెట్రోను కూడా విస్తరించినున్నట్లు ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగరంలో మరో ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. విస్తారమైన గోల్ఫ్‌ సిటీ నిర్మించేందుకు ప్రొఫెషనల్‌ గోల్ఫర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా స్థానిక భాగస్వామి స్టోన్‌ క్రాఫ్ట్‌ సంస్థతో కలిసి ముందుకు వచ్చింది.


నగరానికి దక్షిణ భాగంలో ఈ గోల్ఫ్ సిటీ ఏర్పాటు కాబోతున్నట్లు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. యూఎస్ టెక్సాస్‌ రాష్ట్రంలో ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా గోల్ఫ్ కోర్టులు నిర్వహిస్తున్న పీజీఏ ప్రతినిధి బృందం, స్టోన్‌ క్రాఫ్ట్‌ సభ్యులు శనివారం (అక్టోబర్ 19) సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు చర్చలు జరగ్గా.. మంత్రి వారి నిర్ణయాన్ని అభినందించారు. గోల్ఫ్‌ కోర్సులు, హోటళ్లు, వినోద పరిశ్రమలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేయడానికి పీజీఏ సంసిద్ధత తెలిపిందని శ్రీధర్ బాబు వెల్లడించారు.


ఈ సంస్థ ప్రస్తుతం షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి ముంబయిలో గోల్ఫ్‌ సిటీ నిర్మిస్తోందన్నారు. ఇక్కడ స్టోన్‌ క్రాఫ్ట్‌ సంస్థ భాగస్వామ్యంతో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందన్నారు. దాదాపు 200 ఎకరాల్లో 18 హోల్‌ ప్రామాణిక గోల్ఫ్‌ కోర్సును నగరానికి దక్షిణ భాగంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ గోల్ఫ్ సిటీ వినియోగంలోకి వస్తే ఈ తరహా కోర్సు సౌత్ ఇండియాలోనే మెుదటిది అవుతుందన్నారు. ఈ గోల్ఫ్ సిటీ ద్వారా వచ్చే పదేళ్లలో 10 వేల మందికి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు.


Latest News
 

కొండా సురేఖపై 100 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా.. 'వాళ్లందరికీ ఇదొక గుణపాఠం Tue, Oct 22, 2024, 06:53 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Tue, Oct 22, 2024, 06:48 PM
గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM