byసూర్య | Thu, Oct 17, 2024, 03:34 PM
HYD: అశోక్ నగర్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద నిరుద్యోగులు గురువారం ధర్నాకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ నగర్ వద్ద అప్రకటిత కర్ఫ్యూ విధించారు. ప్రతి స్టడీ హాల్ వద్ద పోలీస్ వాహనాలు మోహరించారు. ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు కనిపిస్తే వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.