శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక

byసూర్య | Sun, Oct 20, 2024, 11:18 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు భారత కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకునే ఆగష్టు 23వ తేదిని పురస్కరించుకుని దేశ స్థాయిలో విద్యార్థులకు జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ -2024 పేరున పోటీ నిర్వహించడం జరిగింది దేశ వ్యాప్తంగా  ఆగష్టు నుండి  సెప్టెంబర్  వరకు పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలో మొుత్తం దేశ వ్యాప్తంగా 3 లక్షల మంది పాల్గొన్నారు. వాటిలో100  మందిని ఎంపిక చేసి వారికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారు  ప్రసిద్ధ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం , శ్రీహరి కోటను సందర్శించే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ పోటీలలో కోదాడకు చెందిన తేజ విద్యాలయ విద్యార్థులు 200 మంది  పాల్గొన్నారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న గుజ్జుల హర్ష వర్దన్ రెడ్డి ఈ మెుదటి వంద మందిలో నిలిచి అక్టోబర్ 23వ తేదిన శ్రీహరికోటను సందర్శించే బృందంలో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎర్పాచు చేసిన కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి కి ఈనెల 23న శ్రీహరికోటను సందర్శించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని విద్యార్థి తో పాటు సంరక్షకునిగా అధ్యాపకుడు కిషోర్ రెడ్డి కూడా వెళ్లడం జరుగుతుందని  తేజ విద్యాలయ ప్రిన్సిపాల్  వి.రమాసోమిరెడ్డి తెలిపారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM