ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత

byసూర్య | Sun, Oct 20, 2024, 11:23 PM

భూపాలపట్నం రాష్ట్రము నుంచి గంజాయి తో వస్తున్న టవేరా వాహనాన్ని  గూడప్పాడు క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఆత్మకూర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా  గార్ల బయ్యార గ్రామానికి చెందిన మందనపు సుభాష్ కార్ డ్రైవర్ చత్తీస్గడ్ రాష్ట్రం లోని భూపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర 3000 రూపాయలకు కిలో చొప్పున మూడు కిలోల ఎందు గంజాయిని కొనుగోలు చేశారు. దానిని ఎవరికి అనుమానం రాకుండా ప్యాకింగ్ చేసుకొని ప్రయాణికులతో వరంగల్ కు తరలివస్తున్న తవేరా  వాహనాన్ని ఆత్మకూరు మండలం గూడపాడు క్రాస్ రోడ్ వద్ద ఎస్సై పరమేశ్వర్ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
పోలీసులను చూసిన వాహన డ్రైవర్ సుభాష్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకొని మండలించడంతో ఎండు గంజాయి కొనుగోలు చేసి వరంగల్లో 25 వేలకు కిలో చొప్పున అమ్ముతున్నానని  పోలీసులకు తెలిపారు. 2023 వ సంవత్సరంలో అనుభోజు సాయి అనే బాలాజీ నగర్ ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి వెంకట్ బన్నీ మిత్రులతో పరిచయం ఏర్పడిందని సీఐ తెలిపారు. అప్పటినుంచి గంజాయిని తీసుకువచ్చి వరంగల్ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తున్నానని 3000 కొనుగోలు చేసి 25 వేలకు చొప్పున అమ్ముతున్నానని తెలిపారు అన్నారు. గంజాయిని తరలిస్తున్న టవేరాను వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM