byసూర్య | Thu, Oct 17, 2024, 03:34 PM
దేశం కరోనాతో పోరాడుతుంటే వందల కోట్ల రూపాయలు సాయం చేయడమే కాకుండా... ఒకవేళ నా దేశం ఏదైనా కష్టాల్లో ఉంటే 1500 కోట్లు కాదు.. మా ఆస్తి మొత్తం నా దేశ ప్రజలకు ఇస్తా అన్న గొప్ప మానవతావాది రతన్ టాటా అని సామాజిక ఉద్యమకారులు ఉప్పుల మధు యాదవ్ అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రధానం చేసి గౌరవించాలని ఆయన అన్నారు.
భారత పారిశ్రామిక దిగ్గజం, సామాజికవేత్త రతన్ టాటా గారు ఏ ప్రకృతి వైపరిత్యం వచ్చినా ముందుండి సాయం అందించే గొప్ప మానవతావాది, ట్రస్ట్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు అందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారని ఆయన పేర్కొన్నారు .టాటా గ్రూప్ తో లక్షలాది కుటుంబాలలో ఉపాధి కల్పించి వెలుగులు నింపారు. విలువలకు కట్టుబడిన మహానుభావుడు రతన్ టాటా గారు అని ఆయన అన్నారు.దేశంలో అనేక సంస్థలు కంపెనీలను నెలకొల్పి ఎలాంటి లాభ ఆపేక్ష లేకుండా సమాజ సేవ కోసం అనేక మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించారు. వతన్ టాటా నిస్వార్ధమైన ప్రజాసేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డును ప్రధానం చేసి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు....