byసూర్య | Thu, Oct 17, 2024, 03:41 PM
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజిక వర్గం లో బిట్స్ కాలేజీ లో సమాచార హక్కు రక్షణ చట్టం-సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా యూత్ కన్వీనర్ ప్రణీత్, డివిజన్ యూత్ అధ్యక్షులు అడ్డ సతీష్ అధ్యక్షతన నర్సంపేట బిట్స్ కాలేజీలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ డివిజన్ అధ్యక్షులు చెట్టుపెళ్లి విజేందర్ మాట్లాడుతు సమాచార హక్కు చట్టంతో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి తగ్గింది అని అన్నారు, అలాగే డివిజన్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్ మాట్లాడుతు సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రయుధం లాంటిదని దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రజలకు దీనిపై అవగాహన చాలా అవసరమని అన్నారు.
నర్సంపేట డివిజన్ యూత్ అధ్యక్షులు అడ్డా సతీష్ మాట్లాడుతు ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత ఉండాలనేది చట్టం యొక్క ఉద్దేశమని అని మాట్లాడుతూ ఈ సమావేశానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు . సమాచార హక్కు రక్షణ చట్టం ద్వారా సొసైటీ చేసిన కార్యక్రమాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంపత్ రెడ్డి,లెక్చరర్ లు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు