byసూర్య | Thu, Oct 17, 2024, 03:12 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు (ఎలిగేడు మాజీ కే.డి.సి సింగిల్ విండో చైర్మన్,) గోదాల శ్రీనివాస్ మంగళవారం రోజున రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి మరణ వార్త తెలుసుకొని బుధవారం రోజున ఎలిగేడు మండలం,బురహన్మియపేట గ్రామంలోని వారి నివాసానికి చేరుకొని స్వర్గీయ గోదాల శ్రీనివాస్ రెడ్డి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.
అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపి తదుపరి వారి అంతిమ యాత్రలో పాల్గొని శ్రీనివాస్ రెడ్డి పాడెను మోసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...