ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్

byసూర్య | Tue, Sep 24, 2024, 09:31 PM

ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. తెలంగాణలో ఇండ్లులేని నిరుపేదలకు సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం చేస్తామని ప్రకటించారు. జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. అయితే సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. దీంతో ఇండ్లు లేని చాలా మంది పేదలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు. అక్టోబరు 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయంలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకు అందించే అంశంపై కేబినెట్‌లో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వచ్చేనెల 2 నుంచి అర్హులకు హెల్త్‌కార్డులు, రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి ప్రకటనతో ఇండ్లులేని నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు.


కాగా, తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అర్హులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇదివరకే ప్రకటించారు. మెుత్తంగా నాలుగు విడతల్లో రూ. 5 లక్షల సాయం ఇవ్వనున్నారు. బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో రూ.లక్ష, పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత మూడో విడతగా రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష ఇలా మెుత్తంగా నాలుగు విడతల్లో రూ.5 లక్షల సాయం అందించనున్నారు.


Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM